20 ఓవర్లలో 134 ...

     Written by : smtv Desk | Thu, Oct 07, 2021, 06:13 PM

20 ఓవర్లలో 134 ...

ఇప్పటికే ప్లే ఆఫ్స్ లో ప్రవేశించిన చెన్నై సూపర్ కింగ్స్ నేడు పంజాబ్ కింగ్స్ తో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు.

డుప్లెసిస్ 55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 12, జడేజా 15 నాటౌట్, ధోనీ 12 పరుగులు చేశారు. మొయిన్ అలీ (0), రాబిన్ ఊతప్ప (2), అంబటి రాయుడు (4) పేలవంగా ఆడి అవుటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, క్రిస్ జోర్డాన్ 2, షమీ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.





Untitled Document
Advertisements