న్యూఢిల్లీ, డిసెంబర్ 29: వినియోగదారులను ఆకర్షించడానికి టెలికాం దిగ్గజ సంస్థలు పోటి పడుతున్నాయి. రిలయన్స్ జియోకి ధీటుగా ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. కేవలం రూ. 93తో 1జీబీ డేటాతో పాటు ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్ను తీసుకొచ్చింది.10 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందించడమే కాకుండా ద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఇస్తుంది. ఇప్పటికే జియో రూ. 98కి 14 రోజుల వ్యాలిడిటీతో 2.1జీబీ డేటా అందిస్తోంది. అయితే జియోలో రోజుకు 0.15జీబీ డేటా పరిమితి ఉండగా.. ఎయిర్టెల్లో ఎలాంటి పరిమితులు లేవు.