ఇలా చేస్తే చిటికెలో నిద్రపోతారట..

     Written by : smtv Desk | Tue, Nov 02, 2021, 03:30 PM

ఇలా చేస్తే చిటికెలో నిద్రపోతారట..

ప్రస్తుతం ఉన్న పోటి ప్రపంచంలో ప్రతిఒక్కరు తీవ్రమైన ఒత్తిడికి గురై నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే శరీరానికి తగినంత విశ్రాంతి లభించి బాడి రీచార్జ్ అవ్వాలంటే రాత్రి ఏడెనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. కానీ చాలవరకు రాత్రి త్వరగా నిద్ర పట్టదనో, పట్టినా మధ్యలో మెలకువ వచ్చేస్తుందనో ఎక్కువమంది చెబుతూ ఉంటారు. కమ్మటి కలతలేని నిద్ర కరువైతే రోజంతా అలసటగానే అనిపిస్తుంది, ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. మీరు కూడా ఇదే సమస్యని ఫేస్ చేస్తుంటే, ఇదిగో ఇక్కడ ఉన్న సాంప్రదాయ ఆయుర్వేదంలో ఉన్న చిట్కా ఒకటుంది. ట్రై చేసి చూడండి.

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం రాగి, టిన్, జింక్, కంచు వంటివి ఈ విషయం లో హెల్ప్ చేస్తాయి. కాలి మడమలకి ఆవు నెయ్యి లేదా, కోకమ్ బటర్, లేదా కొబ్బరి నూనె అప్లై చేసి కంచు పాత్రతో మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. త్వరగా, గాఢంగా నిద్రపడుతుంది. పడుకోవడానికి ముందు ఆవు నేయి, కోకమ్ బటర్, కొబ్బరి నూనె (ఇదే ఆర్డర్ లో ప్రిఫరెన్స్ ఇవ్వండి) అప్లై చేసి చిన్న కంచు పాత్రతో కొన్ని నిమిషాల పాటూ మసాజ్ చేయండి. ఆయుర్వేదం ప్రకారం మీరు హాయిగా నిద్రపోతే శరీరానికి సెల్స్ ని బిల్డ్ చేసుకోవడానికీ, రిపెయిర్ చేసుకోడానికీ ఛాన్స్ దొరుకుతుంది. ఇందువల్ల ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ గా తయారవుతుంది. ఇలా చేయడంవల్ల బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, అలసిన కళ్ళకి విశ్రాంతినిచ్చి చక్కటి నిద్ర మీసొంతం అవుతుంది.





Untitled Document
Advertisements