సత్యనారాయణస్వామి వ్రతము, గౌరీ పూజ, వివాహము మొదలగు శుభ కార్యాలలోనూ, యజ్ఞయాగాదుల యందు చేతికి కంకణము కట్టుకొనుట ఆచారము. పురుషులకు కుడి చేతికి, స్త్రీలకూ ఎడమ చేతికి కంకణము కడతారు. చేసిన పూజ ఫలం, భావనా తొలగిపోకుండా, ఆ కంకణం ఉన్నంత వరకూ అదే భావన, ప్రశాంతత ఆ కంకణము కట్టుకొనుట వలన సిద్దిస్తుంది. నూలుదారానికి పసుపు రాసి ముంజేతి మణికట్టుకు కడతారు. కంకణ ధారణవల్ల ఆధ్యాత్మికమైన ఈ ప్రయోజనంతో పాటు మరో ప్రయోజనము కూడా ఉంది. ఆహారీరంలోని జీవ నాడుల్లో ముఖ్య నాడి చేతుల మణికట్టు భాగం వరకు ఉంటుంది. కంకణము కట్టుకోవడం వల్ల ఆ భాగంలో కలిగే ఒత్తిడి, రక్త ప్రసరణతో పాటు హృదయ స్పందన సరళ రీతిలోకి వస్తుంది. అక్కడ ఉన్న నాది గర్భాశయం వరకూ ఉంటుంది. అందుకే నాది పట్టుకొని చూసి ఓ స్త్రీ గర్భవతా, కాదా అని కూడా చెప్పగలరు. అంతటి విశిష్టత కలిగిన ఆ స్థానంలోని జీవనాడుల ఉద్దీపన కొరకు పూజా సమయాల్లో కంకణం ధరించే ఆచారం అనాది నుండి కొనసాగుతుంది.