కొంతకాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ మనల్ని పీడిస్తూనే ఉంది. ప్రస్తుతం రెండవ దశలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది తగు సూచనలు చేస్తూ ప్రజలలో దైర్యాన్ని నింపుతున్నారు.
మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి, అనవసరంగా బయటకు వెళ్ళడం మానేయండి, ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోండి, వేడి నీటిని తాగండి ఇలా పలు రకాల సూచనలు చేస్తున్నారు వైద్యులు. అయితే ఈ నీటిని వేడి చేసిన తరువాత తాగడానికి ఎవరు పెద్దగా ఇష్టపడడం లేదు కారణం నీరు కాచినప్పుడు చప్పగా మారిపోతుంది. రుచిగా అనిపించదు. అయితే నీరు వేడిచేసినప్పుడు చప్పగా మారిపోవడానికి గల కారణం ఏమిటి? మనం తాగే నీటిలో కొన్ని లవణాలు ఉండటమే. నీటిని కాచినప్పుడు ఆ లవణాలు వాటి రుచిని కోల్పోవడం వలన నీరు చప్పగా మారుతాయి.