ఏటీఎం నుంచి రూ.10 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకుంటే ఓటీపీ తప్పనిసరి

     Written by : smtv Desk | Wed, Dec 01, 2021, 12:46 PM

ఏటీఎం నుంచి రూ.10 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకుంటే ఓటీపీ తప్పనిసరి

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI అకౌంట్ ఉందా? అయితే మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారా. అయితే ఒక విషయం తెలుసుకోవాలి. ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే కచ్చితంగా మొబైల్ ఫోన్ వెంట తీసుకెళ్లండి.

లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలా అని అనుకుంటున్నారా? ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.10 వేలు లేదా ఆపైన మొత్తంలో డబ్బులు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే.. కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

అందువల్ల మీరు ఏటీఎంకు వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్ వెంట తీసుకెళ్లకపోతే ఓటీపీ ఎంటర్ చేయడం కుదరదు. అందువల్ల డబ్బులు తీసుకోలేరు. అయితే రూ.10 వేల కన్నా తక్కువ మొత్తాన్ని మాత్రం ఓటీపీ లేకుండానే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా చేస్తే నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి అయిపోతుంది. అప్పుడు మళ్లీ అదనపు చార్జీలు చెల్లించుకోవాల్సి రావొచ్చు.

అందువల్ల ఎస్‌బీఐ కస్టమర్లకు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. స్టేట్ బ్యాంక్ కూడా తాజాగా ఓటీపీ క్యాష్ విత్‌డ్రాయెల్ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. సురక్షితమైన లావాదేవీలు లక్ష్యంగా ఈ నిర్ణయం అమలులోకి తీసుకువచ్చినట్లు బ్యాంక్ పేర్కొంటోంది.





Untitled Document
Advertisements