తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్...చాపర్‌లో బిపిన్‌ రావత్ సహా ఇతర ఆర్మీ అధికారులు

     Written by : smtv Desk | Wed, Dec 08, 2021, 02:49 PM

తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్...చాపర్‌లో బిపిన్‌ రావత్ సహా ఇతర ఆర్మీ అధికారులు

భారత త్రివిధ దళాల దళపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఆ విమానంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు సహా మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిసింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కొయంబత్తూర్, కూనూర్ మధ్య ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

కుప్పకూలిన వెంటనే హెలికాప్టర్ మంటల్లో కాలి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న ఇద్దరిని అధికారులు ఆస్పత్రికి తరలించారని స్థానికులు తెలిపారు. మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం ఆర్మీ వర్గాలను, ప్రభుత్వ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించింది. జనరల్ బిపిన్ రావత్‌తో పాటు 14 మందితో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులో ప్రమాదానికి గురైందని ఐఏఎఫ్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన ద్రుశ్యాలను న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ, దూరదర్శన్ న్యూస్ ట్వీట్ చేశాయి.





Untitled Document
Advertisements