కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు!

     Written by : smtv Desk | Tue, Jan 04, 2022, 08:58 AM

 కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు!

కోవిడ్ 19 కేసులు శరవేగంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ తీవ్రత కారణంగా ఉద్యోగస్తులకు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. సగం మంది సిబ్బంది ఇంటి వద్ద నుంచే పని చేయొచ్చని తెలిపింది. కార్యదర్శి ర్యాంక్‌కు దిగువున వారికి ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.
వికలాంగులు, ప్రెగ్నెంట్ మహిళలు ఆఫీస్‌లకు రావాల్సిన పని లేదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు కార్యాలయాల్లో రద్దీని నివారించడానికి అవసరమైన టైమ్ టేబుల్ అనుసరించాలని పేర్కొంది. సెక్రటరీ స్థాయి దిగువున ఉద్యోగులకు ఫిజికల్ అటెండెన్స్‌ను 50 శాతానికి తగ్గించామని, అందువల్ల మిగిలిన వారు ఇంటి వద్ద నుంచే పని చేయొచ్చని వివరించింది.
అంతేకాకుండా కోవిడ్ కంటైన్మెంట్ జోన్లలో నివసించే ఉద్యోగులు అందరూ కూడా ఆఫీస్‌కు రావాల్సిన పని లేదు. కంటైన్మెంట్ జోన్లను డీనోటిఫై చేసిన తర్వాత వీరి ఆఫీస్‌కు రావొచ్చని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు అన్నింటికీ ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని గుర్తించుకోవాలి. అంతేకాక జనవరి 31 వరకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తీసివేస్తున్నామని వెల్లడించింది. అయితే అటెండెన్స్ రిజిస్టర్‌లో అటెండెన్స్ వేయించుకోవాలని సూచించింది. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
కాగా దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఒమిక్రాన్ భయాలు కూడా పెరిగిపోయాయి. ఒమిక్రాన్ కేసులు 1700కే చేరాయి. ఇందులో 639 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసుల్లో మహరాష్ట్ర టాప్‌లో ఉంది. ఇక్కడ 510 కేసులు ఉన్నాయి. తర్వాత ఢిల్లీ ఉంది. ఇక్కడ 351 కేసులు నమోదయ్యాయి.





Untitled Document
Advertisements