అమెరికా, జనవరి 2 : ప్రముఖ మల్టీమీడియా యాప్ స్నాప్చాట్ సీఈవో ఇవాన్ స్పైగల్ తన సంస్థ ఉద్యోగులకు అదిరిపోయే నూతన సంవత్సర పార్టీ ఇచ్చారు. ఏకంగా రూ.26 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దేశాలకు చెందిన 5000 మంది స్నాప్చాట్ ఉద్యోగులుకు ఈ పార్టీ ఇచ్చారు. లాస్ ఏంజెల్స్లోని ప్రముఖ మైక్రోసాఫ్ట్ థియేటర్ను అద్దెకు తీసుకుని మరీ ఈ పార్టీ ఘనంగా జరిపారు. పార్టీలో వివిధ రకాల ఆహార పదార్థాలే కాకుండా గేమ్స్, ప్రముఖ అమెరికన్ పాప్స్టార్ డ్రేక్తో కచేరీ నిర్వహించారు.
కాగా వేడుక ఖర్చు మొత్తం ఇవాన్ స్పైగల్ భరించారు. ప్రస్తుతం ఆయన వార్షిక ఆదాయం 3.5 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.22వేల కోట్లు. గత ఏడాది స్పైగల్ భారతీయులపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ఇవాన్ వార్తల్లోకెక్కారు. దీంతో పలువురు భారతీయులు ఇవాన్పై ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొంత మంది స్నాప్చాట్ యాప్ను తొలిగించారు.