పెరూలో ఘోర బస్సు ప్రమాదం.. 48 మంది మృతి..

     Written by : smtv Desk | Wed, Jan 03, 2018, 10:42 AM

పెరూలో ఘోర బస్సు ప్రమాదం.. 48 మంది మృతి..

లిమా, జనవరి 3: పెరూలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 48 మంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పెరూ రాజధాని లిమాకు 57 మంది ప్రయాణికులతో ఓ బస్సు బయలుదేరింది. ఆ బస్సు పసమాయో ప్రాంతం చేరగానే అక్కడ ఓ ట్రక్కును ఢీకొట్టి లోయలో పడిపోయింది. బస్సు ఎత్తైన కొండ ప్రాంతం నుంచి కిందకు పడిపోవడంతో 48 మంది ప్రాణాలను కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements