న్యూఢిల్లీ, జనవరి 3: ఈ-కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్ కార్ట్ మొబైల్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను, భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న 'మొబైల్ బొనాంజా'లో రూ. 46 వేల విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఫోన్ ను రూ. 8,990కే పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ ఫోన్ పై రూ. 19,010 స్పాట్ డిస్కౌంట్ ను అందిస్తామని తెలిపింది. దీనికి అదనంగా పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరో రూ. 18 వేల వరకూ తగ్గింపును అందిస్తామని పేర్కొంది. అంతేకాదు రెడ్ మీ నోట్, షావోమీ ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, 2 ఎక్స్ ఎల్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఫీచర్లు ఇలా..
# 5.1 అంగుళాల స్క్రీన్
# 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
# 12 ఎంపీ వెనుక కెమెరా, 5 ఎంపీ ముందు కెమెరా
# 3000 ఎంఏహెచ్ బ్యాటరీ