కాజల్ రెమ్యునరేషన్ తీసుకుంది కనుకనే సినిమా నుంచి తీసేసినా సైలెంట్ గా ఉందా..

     Written by : smtv Desk | Fri, Apr 29, 2022, 10:14 AM

కాజల్  రెమ్యునరేషన్  తీసుకుంది కనుకనే సినిమా నుంచి తీసేసినా సైలెంట్ గా ఉందా..

లక్ష్మికళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై చందమామగా సినీ అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న కాజల్ 'ఆచార్య' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె నటించింది. అయితే, ఈ సినిమా నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు డైరెక్టర్ కొరటాల శివ వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని కాజల్ కు చెప్పగా... ఆమె చిరునవ్వుతో సంతోషంగా పక్కకు తప్పుకుందని ఆయన అన్నారు.
అయితే, ఆచార్య చిత్రం నుంచి కాజల్ తప్పుకోవడంపై ఫిలింనగర్ లో మరో వార్త ప్రచారమవుతోంది. ఈ సినిమా నుంచి ఆమె తొలి షెడ్యూల్ తర్వాత తప్పుకున్నప్పటికీ.. అప్పటికే తన రెమ్యునరేషన్ ను తీసేసుకుందట. దాదాపు కోటిన్నర రూపాయలను ఆమె తీసుకుందని చెపుతున్నారు. తనకు రావాల్సిన డబ్బు ఇవ్వడంతో సినిమా నుంచి పక్కన పెట్టినా ఆమె సైలెంట్ గా ఉందని అంటున్నారు. మరోవైపు ఇటీవలే కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.





Untitled Document
Advertisements