వాషింగ్టన్, జనవరి 3: 'నిజాయితి లేని అవినీతి మీడియాకు అవార్డులను ప్రకటిస్తానని' అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తానని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 'ఫేక్ న్యూస్ ట్రోఫీ ' కోసం ప్రఖ్యాత మీడియా సంస్థలైన సీఎన్ఎన్, ఏబీసీ న్యూస్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్లు తదితర సంస్థలు పోటి పడుతున్నాయని ఆయన అన్నారు.అయితే ఇందులో ట్రంప్ తన ఫేవరేట్ అయిన ఫాక్స్ న్యూస్ ను మినహాయించారు.