మహేష్ సినిమా విషయంలో మాటల మాంత్రికుడు ఎందుకిలా చేస్తున్నాడు?

     Written by : smtv Desk | Fri, May 06, 2022, 11:00 AM

మహేష్ సినిమా విషయంలో మాటల మాంత్రికుడు ఎందుకిలా చేస్తున్నాడు?

అమ్మాయిల కలల రాకుమారుడు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చాక్లెట్ బాయ్ లుక్స్ తో యువతని ఎప్పటికప్పుడు మాయ చేస్తూనే వున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబు `సర్కారు వారి పాట`తో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీగా ఉన్న విషయం తెలిసిందే. `గీత గోవిందం` చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న ఆడియన్స్ ముందుకు రానుంది. రిలీజ్ కు ఇంకా వారం రోజులే సమయం ఉండటంతో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే సర్కారు వారి పాట సినిమా తరువాత మహేశ్ బాబు డైరెక్టర్ రాజమౌళితో ఓ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేసేందుకు ఒప్పుకుని సైన్ చేశాడు.
రాజమౌళితో మూవీ అంటే ఎక్కువ టైమ్ పడుతుంది కాబట్టి.. మహేశ్ బాబు మొదట త్రివిక్రమ్ తో చేసే చిత్రాన్ని పూర్తి చేసేయాలని భావించారు. మహేశ్ కు ఇది 28వ సినిమా. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది. హారికా హాసిని బ్యానర్పై నిర్మితం కానున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం.. ఏప్రిల్ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.
కానీ త్రివిక్రమ్ ఇంకా పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయలేదని.. అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు.. ఇటీవల త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` సినిమాకు మాటలు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఏం కావాలో అవన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాంతో తాను చేయబోయే మరో మూడు రీమేక్ చిత్రాల బాధ్యతను పవన్ త్రివిక్రమ్ కి అప్పగించారట. వాటి పనుల్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. మహేశ్ బాబుతో తీయబోయే మూవీ స్క్రిప్ట్ ను పూర్తి చేయలేకపోయాడని ప్రచారం జరుగుతోంది.
అసలే మహేశ్ బాబు రాజమౌళి మూవీని పట్టాలెక్కించేందుకు తొందర పడుతున్నాడు. కానీ అదేమి పట్టించుకోకుండా త్రివిక్రమ్ వేరే పనులు చూసుకోవడంతో.. మహేశ్ ఆయనపై అసహనం వ్యక్తం చేశారట. దాంతో త్రివిక్రమ్ మరో నెల రోజుల్లో స్క్రిప్ట్ కంప్లీట్ అవుతుందని జూలై రెండో వారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దామని మహేశ్ కు హామీ ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే `సర్కారు వారి పాట` చిత్రం చిత్రీకరణ తర్వాత ఫ్యామిలీతో కలిసి మహేశ్ ఫారెన్ ట్రిప్కు వెళ్లారని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
కాగా మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే `అతడు` `ఖలేజా` సినిమాలు వచ్చాయి. వీటిలో అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కానీ విమర్శకుల నుంచి ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. దీంతో మహేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.





Untitled Document
Advertisements