తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున భూమిని కేటాయించడం పట్ల ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అయితే తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం బంజారాహిల్స్లో 4,935 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది . ఆ భూభాగం హైదరాబాద్ జిల్లా షేక్పేట మండలం ఎన్బీటీ నగర్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.12 వద్ద సర్వే నంబర్ 18/పీ, 21/పీలో ఉందని అందులో ఉంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేవంత్ రెడ్డి వరసగా ట్వీట్లు చేసాడు .''దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదు.రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది. ఎవని పాలయిందిరో తెలంగాణ… జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ'' అంటూ ఏపూరి సోమన్న పాటలోని ప్రాసలను వాడుతూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
మరోవైపు, పాలమూరు నుంచి ప్రజల వలసలు ఆగట్లేదని రేవంత్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. ''అయ్యాకొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగునపడ్డాయి. అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి ఆస్కార్ ఇవ్వొచ్చు. పాలమూరు పచ్చబడ్డదన్నది జూటామాట. సందేహం ఉంటే క్షేత్రానికి వెళ్లి నిజనిర్ధారణ చేద్దాం. వచ్చే దమ్ముందా కేటీఆర్!?'' అని రేవంత్ రెడ్డి ఆగహ్రంతో తెరాసా ప్రభుత్వం పై ట్వీట్లు చేసాడు.
https://twitter.com/revanth_anumula/status/1524971100328927235?t=wXdp3iTVvloJ9Sb5QqAUFAs=19