ఇదేం తొడగొట్టే ఫ్యాంటసి రా బాబు ..

     Written by : smtv Desk | Sat, May 14, 2022, 04:48 PM

ఇదేం తొడగొట్టే ఫ్యాంటసి రా బాబు ..

ఐపిఎల్ 2022 సీజన్లో భాగంగా ప్లే ఆప్స్ రేసులో పోటి పడుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం ఒకదానికొకటి తలపడగా బెంగళూరు జట్టు పై మొదటగా బాటింగ్ చేసిన పంజాబ్ జట్టు బ్యాట్టేర్లు పంజా విసరడంతో బెంగళూరు జట్టు లక్ష్యాన్ని చేదించలేక పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ జట్టు ఓపెనర్ జాని బెయిర్స్తో 66 పరుగులతో మొదటి నుండే బెంగళూరు బౌలర్లపై దాడిని ప్రారంభించాడు. మరో పవర్ హిట్టర్ లివింగ్స్టాన్ కూడా అదే రీతిలో రెచ్చిపోయాడు.కేవలం 42 బంతుల్లో 70 పరుగులు చేసాడు.వీరిద్దరి ఆటతో పంజాబ్ జట్టు 210 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు ముందుంచింది. అయితే ఈ చేజింగ్ లో బెంగళూరు బ్యాటర్లు అందరు చేతులెత్తేయడం తో బెంగళూరు బ్యాట్టేర్లు అందరు కలిపి కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు తీయగా.. రిషి ధావన్, రాహుల్ చాహర్ చెరో రెండు, హర్‌ప్రీత్, అర్షదీప్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో కూడా బెంగళూరు జట్టు ఇంకా ప్లే ఆప్స్ రేసులో ఉండటం విశేషం .అయితే బెంగళూరు తర్వాత మిగిలున్న అన్ని మ్యాచ్ లలో గెలవాల్సి ఉంది . భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్‌లో క్యాచ్ పట్టిన ప్రతిసారీ తొడ కొడుతూ సంబరాలు చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో బెంగళూరు స్టార్ బ్యాటర్ల వికెట్లని పడగొడుతూ పోటీపడి మరీ తొడ కొట్టారు. మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో పంజాబ్ గెలిచింది.ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఆడుతున్న ఈ ఓపెనర్.. శుక్రవారం రాత్రి బెంగళూరు టాప్ ఆర్డర్ బ్యాటర్లు రజత్ పాటిదార్, మహిపాల్ లూమర్ క్యాచ్‌లు పట్టిన తర్వాత మైదానంలో తొడ కొడుతూ కనిపించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హర్‌ప్రీత్ బౌలింగ్‌‌లో గ్లెన్ మాక్స్‌వెల్ క్యాచ్ పట్టిన అర్షదీప్ సింగ్ కూడా శిఖర్ ధావన్ వైపు చూసి తొడ కొట్టాడు. దాంతో.. బౌలర్ హర్‌ప్రీత్ కూడా తొడ కొట్టాడు. ఆ టైమ్‌లో స్టేడియం అభిమానుల కేరింతలతో హోరెత్తిపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లేయర్లతో మాట్లాడిన ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. హర్‌ప్రీత్‌తో కలిసి సరదాగా తొడ కొడుతూ అల్లరి చేసాడు .





Untitled Document
Advertisements