మళ్ళి వార్తల్లోకి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ..

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 03:24 PM

మళ్ళి వార్తల్లోకి  పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ..

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చాలా కాలం తర్వత మల్లి వార్తల్లోకి ఎక్కారు . ఆదివారం ఫైసలాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం దిక్కులేనిదిగా మారిందని విమర్శించారు. ఖాన్‌ను అరెస్టు చేస్తే పరిస్థితిని ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) ఇప్పటికే వ్యూహం రచించిందని రషీద్ అన్నారు. పాక్ నూతన ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ పై మరియు అమెరికా దేశం పై స్వంచాలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాక నూతన ప్రభుత్వంలోని మంత్రులపై కూడా సూటిగా విమర్శలు చేయసాగారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఆయ‌న తండ్రి ఆసిఫ్ అలీ ఇద్దరూ అవినీతిపరులని అన్నారు. బిలావల్ సంపాదించుకున్న డబ్బంతా ఇతర దేశాల్లో ఉందని, అందుకే అమెరికాను టచ్ చేసే ధైర్యం చేయకుండా అక్కడకు పర్యటనకు వెళ్తున్నారని, అక్కడ డబ్బులు అడుక్కుంటారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బహిరంగంగా అమెరికాపై దారుణమైన ఆరోపణలు చేశారు.
పాకిస్థాన్‌లో అమెరికా తొత్తు ప్రభుత్వం ఉందని, దండెత్తకుండానే పాకిస్థాన్‌ను అమెరికా బానిసగా మార్చుకుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తొత్తు ప్రభుత్వాన్ని పాకిస్థాన్‌ ప్రజలు సహించరని అన్నారు. అలాగే ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేస్తే పాకిస్థాన్ మరో శ్రీలంకగా మారుతుందని పాకిస్థాన్ మాజీ మంత్రి అన్నారు.
పాకిస్థాన్‌లోనూ.. విదేశాల్లోనూ తన హత్యకు కుట్ర జరుగుతోందని, తనకు ఏదైనా జరిగితే తను రికార్డ్ చేసి సురక్షిత ప్రదేశంలో ఉంచిన వీడియో మెసెజ్ ద్వారా ఆ నేరస్థుల గురించి ప్రజలకు తెలుస్తుందని ఇమ్రాన్ అన్నాడు.మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేస్తే పాకిస్థాన్‌ మరో శ్రీలంకగా మారిపోతుందని, కొత్త ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌ హెచ్చరించారు.





Untitled Document
Advertisements