టీమ్ ఇండియా మాజీ క్రికెట్ ఆటగాడు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దు మరోసారి వార్తల్లోకి వచ్చాడు. గతంలో 1998 లో జరిగిన సంఘటన ఆదారంగా ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షను సుప్రీమ్ కోర్టు విధించింది . అయితే దాదాపుగా 30 ఏళ్ల క్రితం సిద్దు మరియు అతని స్నేహితుడు కలిసి చేసిన ఘటనకు ఆయనకు ఈ శిక్ష పడింది. అయితే గతంలో సిద్దు మరియు అతని స్నేతుడు కలిసి రోడ్డు మీద ఒక వృద్దుడిని చితకబాదారు. అయితే ఆయన అక్కడికక్కడే మరణించడం తో పరిస్థితి ఇప్పటి వరకు వచ్చింది. అప్పట్లో ఈ కేసులో అయితే బాదితుని కుటుంభ సభ్యులు కోర్టుకు ఎక్కడంతో 1999లో సిద్దు మరియు అతని స్నేహితునికి కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధించి నిర్దోషులుగా ప్రకటించింది. అయితే భాదితుల కుటుంబం మాత్రం అసలు తగ్గకుండా సుప్రీమ్ కోర్టులో రివ్యూ పెటిషన్ వేయడం తో క్రికెటర్ సిద్దుకు మల్లి చుక్కెదురైంది . అయితే ఈ కేసు విషయంలో విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్టు రివ్యూ జరిపి నవజ్యోత్ సింగ్ సిద్దుకు ఒక సంవత్సర కాలం పాటు జైలు శిక్షను విధించింది. అయితే సిద్దు క్రికెట్ కామెంటరీకి చాలా మంది ప్యాన్స్ కూడా ఉన్నారు.