కింగ్ కోహ్లి బ్యాక్ టూ ఫామ్.. గుజరాత్ పై పరుగుల వర్షం

     Written by : smtv Desk | Fri, May 20, 2022, 02:29 PM

కింగ్ కోహ్లి బ్యాక్ టూ ఫామ్.. గుజరాత్ పై పరుగుల వర్షం

ఐపిఎల్ 2022 సీజన్లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మద్య ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఓపెనర్ విరాట్ కోహ్లి బ్యాక్ తో ఫామ్ లోకి రావడం అర్దశతకంతో చెలరేగడం వల్ల బెంగళూరు జట్టు సునాయాసంగా గెలుపొంది ప్లే ఆప్స్ కు కొంతవరకు ఆశలు సజీవంగా ఉంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు బెంగళూరు జట్టు ముందుంచిన 169 పరుగుల లక్ష్యాన్న్ని సులభంగా చేదించింది. మొదటగా బాటింగ్ చేసిన గుజరాత్ జట్టులో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 62 పరుగులతో ఒంటరి పోరాటంతో జట్టును ముందుకు నడిపించాడు. బెంగళూరు బౌలర్లలో హెజల్‌వుడ్ 2, మ్యాక్స్‌వెల్, హసరంగ చెరో వికెట్ తీసుకున్నారు. గుజరాత్ నిర్దేశించిన 169 పరుగులతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ తొలి వికెట్‌కు 115 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి కారణం అయ్యారు . కోహ్లీ 73 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగా ,డుప్లెసిస్ 44 పరుగులు చేసి కోహ్లికి తోడుగా ఆడి అవుటయ్యారు. చావోరేవో మ్యాచ్‌లో నెగ్గిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. విరాట్‌ కోహ్లీ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 కీలక మ్యాచ్‌లో అర్ధ శతకంతో అదరగొట్టడంతో కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అంతేకాదు ఈ ఐపిఎల్ సీజన్లో ఏ మ్యాచ్ లోనూ సరిగ్గా ఆడని కోహ్లి ఎప్పటి నుండో ఫాం లో లేక ఇబ్బంది పడుతున్న రన్ మెషిన్ విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు చేయడంతో అభిమానులలో ఆనందం ఉప్పొంగింది.





Untitled Document
Advertisements