తారక్ తో సినిమాకు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా లేక నో చెప్పేనా!

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 08:49 AM

తారక్ తో సినిమాకు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా లేక నో చెప్పేనా!

అలనాటి నటి అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ సిని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా జాన్వీని ఫైనల్ చేసారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. అయితే ఈ కథనాలన్నీ నిజం కాదని ప్రూవ్ అయ్యింది. అదేవిధంగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై స్పష్టత రాలేదు.
కానీ జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని ఉవ్విళ్లూరే అగ్ర దర్శకులకు కొదవేమీ లేదు. పూరి జగన్నాథ్, కొరటాల శివలాంటి దర్శకులు ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక పోటీలో ఎందరు ఉన్నా కొరటాల ఒకడుగు ముందే ఉన్నారన్నది తాజా ప్రచారం.
తదుపరి NTR 30 కోసం సన్నాహకాల్లో ఉన్న కొరటాలశివ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నాయికగా నటించేందుకు జాన్వీని సంప్రదించారని టాక్ వినిపించింది. కొరటాల వైపు నుంచి జాన్వీ కపూర్ కి ప్రపోజల్ వెళ్లింది. కానీ అట్నుంచి ఇంకా సమాధానం రాలేదని గుసగుస వినిపిస్తోంది. జాన్వీ తన నిర్ణయం కోసం కొరటాల వేచి చూస్తున్నారు. అయితే తారక్ సరసన నటించేందుకు ఓకేనా లేక ఇంకా ఎవరైనా తన మైండ్ లో ఉన్నారా? జాన్వీ కపూర్ మైండ్ లో ఏం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు అతడి సరసన నటించే అవకాశాన్ని జాన్వీ ఒకే చేస్తుందా లేదా రిజెక్ట్ చేస్తుందా.. తారక్ ని మించిన స్టార్ డమ్ తో ఇంకా ఎవరైనా పాన్ ఇండియా స్టార్ తనకోసం దిగి రావాలని కోరుకుంటోందా? అన్నది తెలియాలంటే వేచి చూడాలి.
జాన్వీ కపూర్ తదుపరి `మిస్టర్ అండ్ మిసెస్ మహి` సినిమాతో మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో జాన్వీ పెళ్లయిన యువతిగా.. మహిళా క్రికెటర్ గా కనిపించనుంది. అంతకుముందే జాన్వీ కపూర్ వరుస ఫోటోషూట్ల జాతర వెబ్ ని ముంచెత్తుతోంది. సంథింగ్ ఏదో తనలో ఉందని నిరూపించేందుకు నిరంతరం తనదైన శైలిలో జాన్వీ విరుచుకుపడుతూనే ఉంది. పాతిక ప్రాయంలోనే ఈ భామ స్టార్ డమ్ ని ఆస్వాధిస్తోంది. శ్రీదేవి నటవారసురాలిగా తనకి ఉన్న బ్యాకింగ్ దృష్ట్యా జాన్వీ ఇప్పటికే పోటీబరిలో దూసుకుపోతోంది. బోనీకపూర్.. కరణ్ జోహార్ లాంటి దిగ్గజాలు జాన్వీ కెరీర్ కి మెరుగులద్దుతున్న తీరు నిరంతరం చర్చకు వస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. రొమాంటిక్ కామెడీ `దోస్తానా 2` రిలీజ్ కు రావాల్సి ఉంది. అలాగే ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించిన `గుడ్ లక్ జెర్రీ`లో జాన్వీ కపూర్ నటిస్తోంది. హెలెన్ రీమేక్ `మిల్లీ`లోను హీరోయిన్ గా నటిస్తుంది. రూహి సహనటుడు రాజ్ కుమార్ రావుతో మిస్టర్ అండ్ మిసెస్ మహి`లో నటిస్తోంది. వరుణ్ ధావన్ తో `భవాల్` అనే సినిమా చేస్తోంది. నేటితరంలో వరుస ఆఫర్లతో క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతోంది జాన్వీ.





Untitled Document
Advertisements