సౌతాఫ్రికాతో టెస్టు జట్టులో పుజారాకు చోటు.. కారణం ఇదేనటా

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 02:30 PM

సౌతాఫ్రికాతో టెస్టు జట్టులో పుజారాకు చోటు.. కారణం ఇదేనటా

టీం ఇండియా ప్రముఖ టెస్ట్ క్రికెట్ ఆటగాడు పుజారాకు దక్షిణాఫ్రికాతో జరుగనున్న టెస్టు సిరీస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత అనుకున్నంత ఫాంలో లేని సమయంలో పుజారాకు జట్టులో చోటు కల్పించడానికి కారణం ఇదేనట.. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత శ్రీలంక టెస్ట్ సిరీస్ లో పుజారా విఫలం అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు దేశవాళీ క్రికెట్లో కూడా పుజారా అంతగా రాణించలేదు. పూజారా ఇంగ్లాండ్లో జరుగుతున్న కౌంటీ జట్టు తరఫున ఆడడం వలన అతనికి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది అని చెప్పవచ్చు. అయితే అక్కడ జరిగే మ్యాచుల్లో పుజారా ఏకంగా రెండు సెంచరీలు రెండు డబుల్ సెంచరీలు చేయడం వల్లనే జట్టులోకి తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ జరిగిన ససెక్స్ మొదటి ఇన్నింగ్స్లో ఫెలవ ప్రదర్శన తో మొదలుపెట్టిన తరువాతి ఇన్నింగ్స్లో సెంచరీతో తదుపరి మ్యాచ్లో ఒక సెంచరీ మరియు డబుల్ సెంచరీ చేయడం విశేషం. అంతే కాక మరొక మ్యాచ్ లో ఏకంగా 170 పరుగులు చేయడం వల్ల దానిని దృష్టిలో పెట్టుకుని దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా టీమిండియా టెస్టు సిరీస్కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇది ఒకటి మరియు టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లోలేని కారణంగా జట్టులోకి తీసుకోవడం జరిగిందని అంచనా వేయవచ్చు . ఎందుకంటే ఎలాంటి పిచ్ లో అయినా పుజారా బ్యాట్ తో రాణించగల సామర్థ్యం ఉండటం వల్ల మరియు టెస్ట్ క్రికెట్ లో పుజారాకు చాలా అనుభవం ఉన్న కారణంగా అతడిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం.





Untitled Document
Advertisements