అమెరికాలో కాల్పుల కలకలం.. 19 మంది విద్యార్థులు మృతి..

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 11:41 AM

అమెరికాలో కాల్పుల కలకలం.. 19 మంది విద్యార్థులు మృతి..

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది ఈ కాల్పుల్లో 21 మంది మరణించగా, అందులో 19 మంది పాఠశాల విద్యార్థులు మరణించడం జరిగింది. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డే పట్టణంలో సాల్వెడార్ రామోస్ అనే 18 ఏళ్ల యువకుడు టెక్సాస్ లోని ఓ పాఠశాలలో కాల్పులు జరపగా 19 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు అంతేకాక మరో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. కాల్పుల్లో మృతి చెందిన వారి వయస్సు నాలుగు నుంచి 11 ఏళ్ళ మధ్యనే ఉంటుందని మహారాష్ట్ర గవర్నర్ గ్రెగ్అబాట్ వెల్లడించారు. అయితే ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలుపుతూ.. శ్వేత భవనంపై మే 28వ తారీకు వరకు కాల్పుల్లో మరణించిన వారికి గౌరవసూచకంగా జాతీయ జెండాను అవధానం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే అమెరికాలో కొద్దిరోజుల కిందటే బఫెలో ని సూపర్ మార్కెట్ వద్ద కాల్పులు జరిగిన విషయం తెలిసిందే అయితే 2018 తర్వాత ఎక్కువగా మృత్యువాత పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ వార్త విన్న అమెరికా ప్రజానీకం అంత దిగ్బ్రాంతికి లోనయ్యారు.





Untitled Document
Advertisements