టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం బీసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలి ఈసారి ఐపీఎల్ ఐపీఎల్ లో వెలుగులోకి వచ్చిన యువ ఆటగాళ్ల పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులోభాగంగా ఆయన సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ మరియు మరికొందరు ఆటగాళ్ల ఆట తీరు గురించి వివరించడం జరిగింది. అయితే సౌరవ్ గంగూలీ ''ఉమ్రాన్ మాలిక్ గురించి ప్రస్తావిస్తూ అతని పేస్ లోనే అతని బలం ఉంది. అతని భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉంది ఇలాగే బౌలింగ్ కొనసాగిస్తే భవిష్యత్తులో టీమిండియాకి ఇంకా ఎక్కువ రోజులు ఆడొచ్చు'' అని వ్యాఖ్యానించాడు. ఈసారి ఐపీఎల్ సీజన్లో తిలక్ వర్మ చక్కగా ఆడాడు. అలాగే గుజరాత్ జట్టు నుండి రాహుల్ తెవాటియా, సన్ రైజర్స్ నుంచి రాహుల్ త్రిపాఠీ వంటి వారు మళ్లీ రాణించారని ప్రశంసలు కురిపించాడు. అయితే ఈసారి సౌతాఫ్రికాతో టి20 సిరీస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఎంపిక కావడం విశేషం .