రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దనే చంద్రబాబు ఈ అల్లర్లకు దారి తీయించాడు..విజయసాయి రెడ్డి

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 01:12 PM

రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దనే చంద్రబాబు ఈ అల్లర్లకు దారి తీయించాడు..విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కోనసీమ లో ఉద్రిక్త పరిస్తితులకు కారణం చంద్రబాబు మరియు అతని అనుచరులే కారణమని వ్యాఖ్యానించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దానిని వ్యతిరేఖించే వారి వెనకాల చంద్రబాబే ఉన్నారని ఈ విధంగా అంబేద్కర్ ను అవమానిస్తే పుట్టగతులు లేకుండా పోతారని మండిపడ్డారు. అంతేకాదు దావోస్ నగరం లో రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకువద్దమనే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు వెళ్ళారని రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలనే నెపంతోనే చంద్రబాబు ఈ అల్లర్లకు జనాలను రెచ్చగొట్టారని పేర్కొన్నారు.
ఇలాగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని విజయసాయి రెడ్డి మండిపడ్డారు . అంతేకాదు చరిత్రలో కూడా ఎందరో ఇలాగే చేసి ఎవరికీ కనిపించనంతగా కనుమరుగయిపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన అక్రమాలు అరాచకాల గురించి అందరికి తెలుసునని అందుకే ఆంధ్రా ప్రజలు తనని వద్దనుకున్నారని విజయసాయి రెడ్డ్డి ఎద్దేవా చేసారు.






Untitled Document
Advertisements