లక్షమంది ప్రేక్షకుల ముందు ఆడి అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటాం..శుభ్ మన్ గిల్

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 02:18 PM

లక్షమంది ప్రేక్షకుల ముందు ఆడి అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటాం..శుభ్ మన్ గిల్

ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో మంగళవారం రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో గెలిచి నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. ఆరంగేట్రం సీజన్ లోనే అద్భుతమైన ప్రతిభ కనబర్చి అన్ని విభాగాలలో దృఢంగా కనిపించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్స్ కు చేరింది. అయితే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ మ్యాచ్ను హోమ్ టౌన్ అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆడనుంది అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శుభ్ మన్ గిల్ ఫైనల్ మ్యాచ్ ను హోమ్ టౌన్ లో ఆడటం ఎంతో సంతోషంగా ఉందని.. పైగా నరేంద్రమోదీ స్టేడియం లక్ష మంది ప్రేక్షకులతో సామర్థ్యం కలిగి ఉంది. అయితే లక్ష మంది ప్రేక్షకుల ముందు తాను ఇప్పటివరకు ఇలాంటి మ్యాచ్ ఆడలేదని ఫైనల్ లో అంతమంది ముందు ఆడటం చాలా స్పెషల్ అని ఈ అవకాశాన్ని తమ జట్టు సద్వినియోగ పరచుకుని ఫైనల్ లో గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.





Untitled Document
Advertisements