ఆంధ్రప్రదేశ్ ను వైఎస్సార్ ప్రదేశ్ గా మార్చితే బెటర్ ..నాగేశ్వర రావు

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 02:50 PM

ఆంధ్రప్రదేశ్ ను వైఎస్సార్ ప్రదేశ్ గా మార్చితే బెటర్ ..నాగేశ్వర రావు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై సిబిఐ మాజీ డైరెక్టర్ , రిటైర్డ్ ఐపీస్ అధికారి ఎం నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచుతూ .. కొన్ని జిల్లాల పేర్లను మార్చడం జరిగింది. ఈ అంశం పై ఆయన జగన్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ .. ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకిపారవేస్తున్నాం కాబట్టి.. తాను చెప్పిన పేరు పెడితే భేషుగ్గా ఉంటుందని పేర్కొంటూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పేరును వైఎస్సార్ ప్రదేశ్ గా మార్చాలని సూచించారు . లేని తరుణంలో వైఎస్సార్ ల్యాండ్ అనే పేరునుపెడితే ఇంకా బాగుంటుందని ఆయన వెల్లడించారు. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగ స్థాయి నుండి వచ్చిన ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఆంధ్రాలో కోనసీమ జిల్లా పేరును మార్చడం వల్ల కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను గురించి అందరికి తెలిసిందే . అయితే ఆంధ్రాలో మొబైల్ సిగ్నల్ లను కూడా నిలిపివేయడం జరిగింది.






Untitled Document
Advertisements