యాసంగి వడ్ల కొనుగోళ్ళ పై కేసిఆర్ సర్కారు పై షర్మిలక్క ధ్వజం ..

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 03:13 PM

యాసంగి వడ్ల కొనుగోళ్ళ పై కేసిఆర్ సర్కారు పై షర్మిలక్క ధ్వజం ..

తెలంగాణా వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిలా తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై యాసంగి వడ్ల కొనుగోలు పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పంజాబ్ రైతుల చావులు క‌న‌ప‌డ్డ కేసీఆర్‌కు తెలంగాణ రైతుల చావు కేక‌లు వినిపించ‌డం లేదా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల‌కు తీసుకొచ్చిన రైతులు ప‌ది రోజులుగా ప్ర‌భుత్వం కొంటుందో, లేదో తెలియ‌క కొనుగోలు కేంద్రాల్లో రైతులు వేచి చూస్తున్నారని అలాగే వేచి చూసి చూసి అక్కడే వడ్ల కుప్పల వద్ద మరణించిన సిద్దారములు అనే రైతు ఫోటోను కూడా షేర్ చేసారు. వానాకాలం పంటలు వేసుకోవడానికి రైతులు పొలాల బాట పట్టాల్సి ఉన్నా, మీరు వడ్లు కొనక కల్లాల్లోనే రైతును పడి గాపులు కాయిస్తున్నారు. పంటలు కొనకుండా, పాడె ఎక్కిస్తున్నారు. ఆఖరి గింజ వరకూ కొంటానని రైతుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్నారు. ఇంకెంతమంది రైతులు చనిపోతే ధాన్యం కొంటారు దొరా?అని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు . అయితే వైఎస్ షర్మిలా తెలంగాణ ఈ మద్య చాలా చురుకుగా పాల్గొంటూ తెలంగాణా సర్కారు పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తుంది.





Untitled Document
Advertisements