బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఇవాళ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆర్ కృష్ణయ్య తోపాటు విజయసాయిరెడ్డి , బీద మస్తాన్ రావు మరియు నిరంజన్ రెడ్డిలు రాజ్యసభకు నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ అనంతరం ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ తాను ఎప్పటినుండో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్నానని తనకు ఈ అవకాశం ఇచ్చి మరింతగా ప్రోత్సహించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక సామాజిక న్యాయం అందించే విషయంలో జగన్ ఎప్పుడూ నంబర్ వన్ గా కొనసాగుతారని ఆయన ను ఆకాశానికి ఎత్తేశారు. దేశవ్యాప్తంగా బీసీ పార్టీలు ఎన్ని ఉన్నప్పటికీ బిసి బిల్లును పార్లమెంట్లో ఇప్పటివరకు ప్రస్తావించలేదు అని ఒక వైసిపి పార్టీ మాత్రమే ఆ బిల్లును గురించి ప్రస్తావించి ఉందని పేర్కొన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ లోటు బడ్జెట్ లో ఉన్న కూడా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య జగన్ ను ఎంతగానో కొనియాడారు.