తెలంగాణకు ప్రధాని రాక.. బెంగళూరుకు సీఎం ప్రయాణం..

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 06:16 PM

తెలంగాణకు ప్రధాని రాక.. బెంగళూరుకు సీఎం ప్రయాణం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ పర్యటన అర్ధంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 20న కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. 21న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు . ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌లతో సమావేశం ముగించుకొని చండీగఢ్ లో కేంద్రం తెచ్చిన నల్ల రైతుచట్టాలకు వ్యతిరేఖంగా పోరాడిన రైతుకుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అయితే ఈ చెక్కుల పంపిణీ అనంతరం కేసీఆర్ నేరుగా హైదరాబాద్ వచ్చారు. అయితే ఈరోజు అనగా 25వ తేదీన కెసిఆర్ బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో సమావేశం అయ్యేది ఉండగా ఆ సమావేశం కాస్త రేపు జరగనుంది. కావున కెసిఆర్ గురువారం ఉదయం కర్ణాటక బయలుదేరతారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానికి స్వాగతం పలికిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం ఉన్నట్లు సమాచారం. దాని దాదాపుగా మూడు గంటల పాటు హైదరాబాదులో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.





Untitled Document
Advertisements