రేపటి నుంచి జగనన్న బస్సు యాత్ర.. సామాజిక న్యాయం ఫలించినట్టేనా

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 10:51 AM

రేపటి నుంచి జగనన్న బస్సు యాత్ర.. సామాజిక న్యాయం ఫలించినట్టేనా

ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అవినీతి ని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యక్రమాలు అలాగే సామాజిక న్యాయం అంటూ జగనన్న భరోసా వైసిపి తాము ప్రవేశపెట్టిన పథకాలను గురించి ప్రచారానికి వెళ్లనున్నాయి. అయితే దీనిలో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా సామాజిక న్యాయం చేకూర్చింది . ఆయా వర్గాల కోసం ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టింది అనే అంశంపై ఆ పథకాలలోని అవినీతిపై తెలుగుదేశం పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్న బాదుడే బాదుడు ఈ కార్యక్రమానికి కౌంటర్ గా సామాజిక న్యాయం పేరిట బస్సు యాత్రను రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనేది తెలియాల్సి ఉంది . ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రజల పై జరుగుతున్న కరెంటు కోతలు మొదలైన అంశాలపై బాదుడే బాదుడు కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలో జగన్ యొక్క బస్సుయాత్ర ఏ విధమైన ఫలితాలను తీసుకురానుంది అనేది కీలక అంశంగా మారింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆయా పార్టీలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నాయి అయితే రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేదానికి ఈ కార్యక్రమాలే సాక్షి.





Untitled Document
Advertisements