కేసీఆర్ బెంగళూరు షెడ్యుల్ ఇదే

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 11:48 AM

 కేసీఆర్ బెంగళూరు షెడ్యుల్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ పర్యటన అర్ధంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 20న కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. 21న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు . ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌లతో సమావేశం ముగించుకొని చండీగఢ్ లో కేంద్రం తెచ్చిన నల్ల రైతుచట్టాలకు వ్యతిరేఖంగా పోరాడిన రైతుకుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అయితే ఈ చెక్కుల పంపిణీ అనంతరం కేసీఆర్ నేరుగా హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి బెంగళూరుకు మాజీ ప్రధాని దేవేగౌడ ను కలవడానికి ఈరోజు ఉదయం 10 గంటలకు విమానయానం మొదలుపెట్టారు. అయితే కేసీఆర్ ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు 12:30 సమయంలో మాజీ ప్రధాని దేవెగౌడ కలిసి ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. తరువాత నాలుగు గంటల సమయంలో సమావేశాన్ని ముగించుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం మొదలు పెట్టనున్నారు. సాయంత్రం 5:30 సమయంలో ప్రగతి భవన్ కు సీఎం చేరుకోవడం జరుగుతుంది. అయితే హైదరాబాద్ కు ప్రధాని మోడీ వస్తున్న సమయంలో కెసిఆర్ బెంగళూరు పర్యటన ఎందుకు పెట్టుకున్నారు అనే అంశం పైన ఇంకా అందరికీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.





Untitled Document
Advertisements