కరీంనగర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి..

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 12:06 PM

కరీంనగర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండి..

తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కి సవాల్ విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆలయాలు అన్నింటినీ కూల్చివేసి మసీదులు కట్టారని అందుకే మసీదును తవ్వి చూసినా శివలింగాలు బయటపడుతున్నాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ క్రమంలోనే బండి సంజయ్ అక్కడ శివలింగాలు కనిపిస్తే ఆ ప్రాంతం హిందువులది ఒకవేళ శవాలు గనుక కనిపిస్తే అది మీ ముస్లింలది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మదరసాలు రద్దు చేస్తాం .. మరియు మైనార్టీ రిజర్వేషన్లు తొలగించి వాటిని ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాక కరీంనగర్ మధ్యలో ఉన్న ఈద్గా తొలగించాలంటే వేములవాడ గుడిలో ఉన్న దర్గా తీసివేయాలి అన్నా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రామ రాజ్యం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే సంజయ్ వీటన్నింటికీ తాను రెడీ అని తనతో పాటుగా యువకులు కూడా ఇదే మార్గంలో రావాలని వారిని కోరారు. అయితే బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులను సృష్టిస్తాయో అని అంతట ఆందోళన చెందుతున్నారు.





Untitled Document
Advertisements