భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనే అమలు చేస్తున్నారని కుటుంబ పాలన తరిమికొట్టిన దేశం బాగుంటుంది అని లేకపోతే దేశ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. తనకు ప్రతి సారి ఘనంగా ఆహ్వానం పలుకుతున్నాం తెలంగాణ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. తెలంగాణను ఒక్క కుటుంబ పార్టీని అభివృద్ధి చేయకుండా వారు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కాలంలో మరణించిన వారికి నివాళులు తెలుపుతున్నాను అని పేర్కొంటూ వారి ఆశయాలను నెరవేర్చాలని తెలంగాణ ప్రజానీకానికి మోడీ పిలుపునిచ్చారు. తెలంగాణ లో కుటుంబ పాలనకు అంతం పలకాలని దాని కోసం అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు ఈ సమావేశం అనంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్లో జరిగే కార్యక్రమానికి నరేంద్ర మోడీ బయలుదేరారు. అయితే నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరు పర్యటన గురించి అందరికీ తెలిసిందే. అయితే కేసీఆర్ నరేంద్ర మోదిని కలగకుండా ఉండటానికి బెంగళూరు వెళ్లారని వార్తలు కూడా వెల్లువెత్తుతున్నాయి.