మాజీ ప్రధాని మరియు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రితో కేసీఆర్ సమావేశం సమాప్తం..

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 03:39 PM

మాజీ ప్రధాని మరియు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రితో కేసీఆర్ సమావేశం సమాప్తం..

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దేశ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు పలు రాష్ట్రాల ముఖ్య నేతలతో సమావేశం అవుతుందని తెలిసిందే అయితే అంతకుముందే ఆయన థర్డ్ ఫ్రంట్ తీసుకు వచ్చి దేశంలో కాంగ్రెస్ మరియు బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చేసిన ప్రణాళిక వికటించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియన్ బిజినెస్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అయితే ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెంగళూరు లో మాజీ ప్రధాని దేవెగౌడ మరియు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో భాగంగా దేశంలో భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాక రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై కూడా వీరు మాట్లాడుకున్నట్లు సమాచారం వెల్లడయింది. అయితే ఇటు హైదరాబాదులో విమానం దిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన నరేంద్ర మోడీ కుటుంబ పార్టీలను ప్రోత్సహించ వద్దని తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే దీనిపై బెంగళూరు పర్యటనను ముగించుకుని వస్తున్న కెసిఆర్ ఏవిధంగా స్పందిస్తారో అనేది వేచి చూడాలి.





Untitled Document
Advertisements