బ్రెజిల్లో పేలిన తుపాకులు పోలీసులకు స్మగ్లర్ల మధ్య కాల్పులు

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 05:31 PM

బ్రెజిల్లో పేలిన తుపాకులు పోలీసులకు స్మగ్లర్ల మధ్య కాల్పులు

బ్రెజిల్ నగరంలో స్మగ్లర్లకు మరియు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. అయితే స్మగ్లింగ్ ముఠాలు పట్టుకునేందుకు పోలీసులు పథకం వేయగా అందులో స్మగ్లింగ్ ముఠాలకు సంబంధించిన వారు పోలీసులను గుర్తించి ఫైరింగ్ చేయగా ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి కి బుల్లెట్లు తగిలి మరణించగా 11 మంది స్థానికులు గాయపడినట్లు పోలీసులు మొదటగా వెల్లడించారు. అయితే స్మగ్లింగ్ ముఠాలు పట్టుకోవడానికి పోలీసులు ఒక హెలికాప్టర్ కూడా ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు సైనిక బలగాల సహాయం కూడా తీసుకున్నట్లు వెల్లడించడం జరిగింది. అయితే ఆ బాధితులను తరలించిన ఆసుపత్రి వర్గాలు మాత్రం 22 మంది చనిపోయారని మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారని అందులో ఒక మహిళ కూడా మరణించారని వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఘటన విలా క్రూజెరియా పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ షూటింగ్ ప్రారంభమైందని, భయాందోళనలకు దారితీసిందని సామాజిక మాధ్యమాలలో వార్తలు వెల్లువెత్తాయి.





Untitled Document
Advertisements