బ్రెజిల్ నగరంలో స్మగ్లర్లకు మరియు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. అయితే స్మగ్లింగ్ ముఠాలు పట్టుకునేందుకు పోలీసులు పథకం వేయగా అందులో స్మగ్లింగ్ ముఠాలకు సంబంధించిన వారు పోలీసులను గుర్తించి ఫైరింగ్ చేయగా ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి కి బుల్లెట్లు తగిలి మరణించగా 11 మంది స్థానికులు గాయపడినట్లు పోలీసులు మొదటగా వెల్లడించారు. అయితే స్మగ్లింగ్ ముఠాలు పట్టుకోవడానికి పోలీసులు ఒక హెలికాప్టర్ కూడా ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు సైనిక బలగాల సహాయం కూడా తీసుకున్నట్లు వెల్లడించడం జరిగింది. అయితే ఆ బాధితులను తరలించిన ఆసుపత్రి వర్గాలు మాత్రం 22 మంది చనిపోయారని మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారని అందులో ఒక మహిళ కూడా మరణించారని వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఘటన విలా క్రూజెరియా పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ షూటింగ్ ప్రారంభమైందని, భయాందోళనలకు దారితీసిందని సామాజిక మాధ్యమాలలో వార్తలు వెల్లువెత్తాయి.