నిఖత్ జరీన్ తోపాటు మరో ఇద్దరికి విరాట్ కోహ్లీ ప్రశంసలు..

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 10:37 AM

నిఖత్  జరీన్ తోపాటు  మరో ఇద్దరికి విరాట్ కోహ్లీ ప్రశంసలు..

ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ని భారత్ కైవసం చేసుకుంది. అందులోను తెలంగాణాకు చెందిన 25 ఏళ్ల యువ బాక్సర్ నిఖత్ జరీన్ భారత్ కు స్వర్ణ పతాకాన్ని అందించింది. గతవారం జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్ లో స్వర్ణపతాకం తో అబ్బురపరిచింది. ఆమె ఈమె ఫైనల్ రౌండ్ లో థాయిలాండ్ కు చెందిన జిట్ పాంగ్ జుటమాస్ అనే బాక్సర్ పై 5 - 0 తేడాతో అజేయంగా గెలుపొందింది. జూనియర్ ప్రపంచ ఛాంపియన్ గా ఇంతకు ముందే అందరిని అలరించిన నిఖత్ జరీన్ ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఛాంపియన్ షిప్ ను గెలవడం వల్ల అందరు ఆమెను అభినందిస్తున్నారు. ఇప్పటికే భారత్కు చెందిన పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు. అయితే భారత క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ నిఖత్ జరిన్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అంతేకాక నిఖత్ జరీన్ తో పాటు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పాల్గొన్న మనీషా మరియు పర్వీన్ లకు కూడా అభినందనలు తెలియజేస్తూ దేశాన్ని గర్వించదగ్గ స్థాయికి తీసుకు వచ్చినందుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements