అమలాపురంలో అల్లర్లకు కారణం వారే.. ఏలూరు రేంజి డీఐజీ

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 10:37 AM

అమలాపురంలో అల్లర్లకు కారణం వారే.. ఏలూరు రేంజి డీఐజీ

ఏపీలోనీ కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురంలో గత మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై పోలీసులు స్పందించారు. అమలాపురంలో జరిగిన సంఘటనలపై ఏలూరు రేంజి డీఐజీ పాల‌రాజు గురువారం కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు. నిన్న మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న.. అల్ల‌ర్ల‌లో పాలుపంచుకున్న వారిలో దాదాపు ఇప్ప‌టిదాకా 19 మందిని అరెస్ట్ చేశాఋ అనే విషయాన్ని వెల్ల‌డించారు. అంతేకాక అమ‌లాపురంలో చెలరేగిన అల్ల‌ర్ల‌కు రౌడీ షీట‌ర్లే కార‌ణ‌మ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.
అదేవిధంగా ఈ అల్ల‌ర్ల‌లో పాలుపంచుకున్న మ‌రి కొంతమందిని గుర్తించామ‌ని, నేడు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మేము ఎవరినైతే అనుమానితులుగా భావిస్తున్నామో వారందరి అరెస్టులు పూర్త‌య్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవ‌ల నిలుపుద‌ల‌ను కొన‌సాగిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. అరెస్టులు ముగిశాక ద‌శ‌ల‌వారీగా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని పాల‌రాజు పేర్కొన్నారు.





Untitled Document
Advertisements