జగనన్న బస్సుయాత్రకు విజయనగరంలో బ్రేక్

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 10:51 AM

జగనన్న బస్సుయాత్రకు విజయనగరంలో బ్రేక్

ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అవినీతి ని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యక్రమాలు అలాగే సామాజిక న్యాయం అంటూ జగనన్న భరోసా వైసిపి తాము ప్రవేశపెట్టిన పథకాలను గురించి ప్రచారానికి నిన్న బస్సు యాత్ర ప్రారంభమైంది. అయితే దీనిలో భాగంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సామాజిక న్యాయం చేకూర్చింది . ఆయా వర్గాల కోసం ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టింది అనే అంశంపై వేసినా.. ఆ పథకాల లోని అవినీతిపై తెలుగుదేశం పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్న బాదుడే బాదుడు ఈ కార్యక్రమానికి కౌంటర్ గా సామాజిక న్యాయం పేరిట బస్సు యాత్ర ప్రారంభం అవ్వగానే విజయనగరం జిల్లాలో బస్సు యాత్ర ఆగిపోయింది. అనుకోకుండా ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులు బలమైన గాలులు వీయడం వలన బస్సు యాత్ర రద్దయింది. దీంతో బస్సు యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెనక్కి వెళ్ళిపోయాయి. అయితే విజయనగరంలో వైసిపి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఈ యాత్ర ప్రారంభం అయ్యేది ఉండగా ఈరోజు రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించే చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే జగన్ అన్న ఈ బస్సు యాత్ర కి దళిత వర్గాల నుండి సవాళ్లు ఎదుర్కోక తప్పదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.





Untitled Document
Advertisements