సరికొత్త కార్యక్రమంలోనూ ఫెయిల్ అయిన జగన్ ప్రభుత్వం.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 12:41 PM

సరికొత్త కార్యక్రమంలోనూ ఫెయిల్ అయిన జగన్ ప్రభుత్వం.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా విలేకరులతో సమావేశం అయినా ఆయన సామాజిక న్యాయం పేరుతో జగన్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రజలకు ఎంత లాభం చేకూరింది అంటూ బస్సు యాత్ర ప్రారంభించారని ఆ బస్సు యాత్ర ద్వారా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు అన్ని బయట పడుతున్నాయని చెప్పుకొచ్చారు. తాము చేసిన అభివృద్ధి కోసం గడపగడపకు కార్యక్రమాన్ని మొదలు పెట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారని ఏం అభివృద్ధి చేశారు అంటూ నిలదీశారు అని పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా వైసిపి ప్రభుత్వం వారు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేశారు చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఒకవైపు వర్గాల మధ్య లో చిచ్చు పెడుతూ మరోవైపు సామాజిక న్యాయం అంటూ ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఒకరికి తగ్గట్లుగా మరొకరు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. జగన్ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల సామాజిక న్యాయం పేరిట బస్సు యాత్ర నిన్న ప్రారంభం అవ్వగా.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట గా భావించే మహానాడు కార్యక్రమాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.





Untitled Document
Advertisements