రూ.8.2 కోట్ల మద్యం బాటిల్ చోరీ..!

     Written by : smtv Desk | Thu, Jan 04, 2018, 06:26 PM

రూ.8.2 కోట్ల మద్యం బాటిల్ చోరీ..!

డెన్మార్క్, జనవరి 4 : మద్యం బాటిల్ దొంగతనానికి గురైన అరుదైన ఘటన డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో చోటు చేసుకుంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..! ఆ మద్యం బాటిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదై౦ది మరి. రూసో బాల్టీక్‌ అనే వోడ్కా బాటిల్‌ ఖరీదు 1.3 మిలియన్‌ డాలర్లు. అనగా దాదాపు రూ.8.2 కోట్లన్న మాట.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాగా గుర్తింపు పొందిన ఈ బాటిల్ ఇప్పుడు చోరీకి గురైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ మద్యం సీసాను మూడు కిలోల బంగారం, వెండితో తయారుచేశారు. సీసా మూతను వజ్రంతో తయారుచేశారు.





Untitled Document
Advertisements