పెట్రోల్, డీజిల్‌ సప్లయిలో సమస్యలు.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

     Written by : smtv Desk | Fri, Jun 17, 2022, 05:26 PM

పెట్రోల్, డీజిల్‌ సప్లయిలో సమస్యలు.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పైపైకి వెళుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెట్రోల్‌, డీజిల్ రేట్లు పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్ట స్థాయిని తాకింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలలో పెట్రోల్, డీజిల్ సప్లయిలో సమస్యలు నెలకొనడంతో కొన్ని ప్రాంతాలలో ఇంధన నిల్వలు నిండుకున్నాయని మీడియా రిపోర్టులు వచ్చాయి. ఈ విషయంపై పెట్రోల్ బంకుల డీలర్లు కూడా పెట్రోలియం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీంతో సప్లయి సమస్యలను తీర్చేలా వెంటనే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. మారుమూల ప్రాంతాల పెట్రోల్ బంకులకు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధనాన్ని సరఫరా చేసేందుకు యూనివర్సల్ సర్వీసు అబ్లిగేషన్‌ను గ్రామాలలో ఉన్న రిటైల్ అవుట్‌లెట్లకు కూడా విస్తరించింది.
పెట్రోల్, డీజిల్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు సరఫరా చేసేందుకు యూనివర్సల్ సర్వీస్ అబ్ల మారూమూల ప్రాంతాలలో ఉన్న ఫ్యూయల్ రిటైల్ అవుట్‌లెట్లకు కూడా కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి సరఫరాలో సమస్యలు నెలకొనడంతో మారమూల ప్రాంతాలలోని పెట్రోల్ బంకులు నిండుకున్నాయని తెలుపుతూ పెట్రోల్ బంకుల డీలర్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్నాటకలోని మారుమూల ప్రాంతాలలో చాలా పెట్రోల్ పంపులలో ఇంధన కొరతలు ఏర్పడ్డాయని తమ లేఖలో తెలిపారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ సర్వీసు అబ్లిగేషన్ కింద తుది కస్టమర్ వరకు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులకు తప్పనిసరిగా పెట్రోల్, డీజిల్‌ను అందించేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బాధ్యత వహించాల్సి ఉంది.
యూఎస్ఓ కింద అన్ని రిటైల్ అవుట్‌లెట్లలో రిటైల్ కస్టమర్లందరికీ ఆయిల్‌ను అందించాల్సిన బాధ్యతను ప్రస్తుతం అధికారిక సంస్థలు కలిగి ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా మార్కెట్లో అత్యధిక స్థాయిలో కస్టమర్ సర్వీసును పొందవచ్చు. మార్కెట్ క్రమశిక్షణలో భాగంగా యూఎస్ఓ విధానాలకు కట్టుబడి ఉండాలి.
ఈ యూఎస్ఓ కింద.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్టిష్ట పని వేళల్లో, నిర్దేశిత క్వాంటిటీ, క్వాలిటీలో పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు డిమాండ్ మేరకు ఏ వ్యక్తికైనా ఈ సర్వీసులు అందజేసేలా ఉండాలి. సరసమైన ధలలో కస్టమర్లకు ఇంధనం అందుబాటులో ఉంచడంలో ఎలాంటి వివక్ష చూపకూడదు. దేశంలో పలు ప్రాంతాలలోని పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం నెలకొన్నట్టు తెలిసింది. రాజస్తాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, గుజరాత్, మధ్య ప్రదేశ్‌లలో పెట్రోల్, డీజిల్ కోసం క్యూలు కడుతున్నట్టు మీడియా రిపోర్టులు వచ్చాయి. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వం చెప్పింది.
మరోవైపు దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం లేదు. క్రూడాయిల్ ధరలు భగ్గుమంటోన్న దేశవ్యాప్తంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, కంపెనీలు ఆయిల్ ధరలను యథాతథంగా ఉంచుతున్నాయి. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన అమ్మకాలపై తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి





Untitled Document
Advertisements