మంత్రి గుడివాడ అమ‌ర్నాధ్‌తో ఇన్ఫోసిస్ ప్ర‌తినిధుల భేటీ

     Written by : smtv Desk | Tue, Jun 21, 2022, 04:19 PM

మంత్రి గుడివాడ అమ‌ర్నాధ్‌తో ఇన్ఫోసిస్ ప్ర‌తినిధుల భేటీ

ఈ మధ్య దావోస్ పర్యటన లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పలు ప్రముఖ కంపెనీలతో భేటి అయిన విషయం తెలిసిందే .ఆ మీటింగ్ లో భారీ క్యాంప‌స్ ఏర్పాటుకు దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. ఆ సందర్భంలో భాగంగా ఈ రోజు (మంగళవారం ) మంత్రి గుడివాడ అమ‌ర్నాధ్‌తో ఇన్ఫోసిస్ ప్ర‌తినిధుల భేటీ జరిగింది . విడ‌త‌ల వారీగా 3 వేల సీటింగ్ కెపాసిటీ క‌లిగిన ఈ క్యాంప‌స్‌ను సాగ‌ర న‌గ‌రం విశాఖ‌లో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ సిద్ధ‌మైంది. తొలి ద‌శ‌లో 1,000 సీటింగ్ కెపాసిటీతో ఈ క్యాంప‌స్‌ను ఆ సంస్థ ప్రారంభించ‌నుంది. ఈ క్యాంపస్ ఏకంగా ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని స‌మాచారం. అంతేకాకుండా తొలుత వెయ్యి సీటింగ్ కెపాసిటీతోనే ప్రారంభం కానున్న ఈ క్యాంప‌స్‌ను ఇన్ఫోసిస్‌ ద‌శ‌ల‌వారీగా 3 వేల సీటింగ్ కెపాసిటీకి పెంచ‌నుంద‌ట‌.





Untitled Document
Advertisements