తీర్ధంతో పాటు విగ్రహాన్ని కూడా....

     Written by : smtv Desk | Fri, Jun 24, 2022, 08:20 PM

తీర్ధంతో పాటు విగ్రహాన్ని కూడా....

మనం గుడికి వెళ్ళినపుడు..దేవుని దగ్గర ఉన్న తీర్ధం తీసుకుంటాం..కానీ ఇక్కడ తీర్ధంతో పాటు విగ్రహాన్నికూడా మింగాడాట .. అది ఏంటో వివరాల్లోకి వెళ్తే...
గుడిలో దేవుని దర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తి(45) తీర్థంతో పాటు శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని మింగాడు. గొంతులో అడ్డంగా ఇరికిపోవడంతో అతను శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స చేసి విగ్రహాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీనికి సంబంధించిన ఎక్స్ రే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
గొంతు కింది భాగంలో ఆ విగ్రహం ఇరికిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆపరేషన్ అనంతరం ఆ విగ్రహాన్ని సంబంధించిన ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. కర్నాటకలోని బెల్గావిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సరైన సమయంలో ఆస్పత్రికి చేరాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడేది.





Untitled Document
Advertisements