తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై దాడులు రోజు రోజుకు మితిమిరుతున్నాయ్ . పోలీసుల శిక్షలకు , చట్టాలకు , ప్రభుత్వాలకు నేరగాళ్లు ఏమాత్రం భయపడడం అనేది పూర్తిగా తగ్గిపోయింది. నిత్యం అత్యాచారాలు , మహిళలపై దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఎక్కడో చోట అత్యాచారం, దాడులు అనే వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా యాదాద్రి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతి గొంతు కొసారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో జరిగింది .దత్తప్పగూడెం గ్రామానికి చెందిన పేరు ఎలుగు యమున వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుంది. శుక్రవారం రాత్రి ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న యమునపై మాస్క్ ధరించి బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తితో ఆమె గొంతు కోశారు. ఆ దుండగులు వెంటనే అక్కడ్నుంచి పరారీ అయ్యారు. బాధితురాలి కేకలు, అరుపులు విని ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు . యువతిపై దాడి ఘటన సమాచారం తెలుసుకున్న మోత్కూర్ ఎస్సై వి జానకి రామ్ రెడ్డి సిబ్బందితో దత్తప్పగూడెం గ్రామాన్ని సందర్శించారు. యువతిపై దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.