'శివసేన బాలాసాహెబ్' అనే పేరుతో కొత్త పార్టీ.. రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 03:11 PM

 'శివసేన బాలాసాహెబ్' అనే పేరుతో కొత్త పార్టీ..  రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్

మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి .రోజుకో ఉత్కంతభరితమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి .ఇప్పటికే వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు ..ఉండేవాళ్ళు వుంటారు ఇంకా అవసరమైతే కొత్త శివసేనను తయారుచేస్తానని ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తెలుపగా ఇప్పుడు ఆ పార్టీకి రెబెల్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఏక్ నాథ్ షిండే నాయకత్వం వహిస్తున్న రెబెల్ ఎమ్మెల్యేలు కొత్త పార్టీని ప్రకటించారు. తమ గ్రూపుకు 'శివసేన బాలాసాహెబ్' అనే పేరు పెట్టినట్టు రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ తెలిపారు. ఇప్పటి నుంచి తమ గ్రూపు శివసేన బాలాసాహెబ్ పేరుతో పిలవబడుతుందని ఆయన తెలిపారు. ఏ పార్టీలో కూడా తాము కలవబోమని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో, రెబెల్ ఎమ్మెల్యేలు ఇక శివసేన గూటికి చేరే అవకాశాలు లేవనే విషయం అర్థమవుతోంది.





Untitled Document
Advertisements