దావూద్ ఇబ్రహీంతో శివసేనకు సంబంధాలు .. సంచలన ఆరోపణలు

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 12:19 PM

దావూద్ ఇబ్రహీంతో శివసేనకు సంబంధాలు .. సంచలన ఆరోపణలు

శివసేనపై ఆ పార్టీ రెబెల్స్ గ్రూపు నేత ఏక్ నాథ్ షిండే మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముంబై బాంబు పేలుళ్లకు కారణమైన దావూద్ ఇబ్రహీంతో డైరెక్ట్ కనెక్షన్ ఉన్న శివసేన పార్టీ ప్రజలకు ఎలా సేవ చేయగలదని ప్రశ్నించారు. ఆ దాడుల్లో ఎంతో మంది ముంబై ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దావూద్ తో ఉన్న కాంటాక్ట్ ను వ్యతిరేకిస్తూనే తాను, తనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశామని అన్నారు. బాల్ థాకరే పార్టీని తాము రక్షించుకుంటామని చెప్పారు. షిండే, ఇతర రెబెల్ ఎమ్మెల్యేలు ఆత్మలు లేని శరీరాల వంటి వారని శివసేన కీలక నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. హిందువుల హృదయ సామ్రాట్ అయిన బాల్ థాకరేకు చెందిన శివసేన పార్టీ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలను ఎలా పెట్టుకుంటుందని షిండే ప్రశ్నించారు. అమాయకులైన ముంబైకర్లను చంపిన వారితో సంబంధాలా? అని దుయ్యబట్టారు. ఈ సంబంధాలను వ్యతిరేకిస్తూ తాము అడుగులు వేస్తున్నామని చెప్పారు. తమ పోరాటంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాము లెక్క చేయబోమని... తమ ప్రాణాలకు హాని ఉన్నా పట్టించుకోబోమని అన్నారు.అయితే ఇప్పటి వరకు షిండే దావూద్ తో ఉన్న సంభందాలను ఎందుకు నిలదియకుండా ఉన్నారు ?ఆ సమయంలో షిండే కూడా శివసేనలో ఉన్నారు కదా మరి ఈ విషయం సంఘటన సమయంలో వ్యతిరేకించకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .





Untitled Document
Advertisements