మొదటి ఘాట్ రోడ్డులో గజరాజుల గుంపు, భక్తుల ఆందోళన..

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 02:30 PM

 మొదటి ఘాట్ రోడ్డులో గజరాజుల గుంపు, భక్తుల ఆందోళన..

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు ఆర్చ్ వద్ద రోడ్డు పక్కన సమీపంలో ఒక్కసారిగా దాదాపుగా 11 ఏనుగులు ప్రత్యక్షమై కొద్దిసేపటి వరకు అక్కడే ఉండిపోయాయి. దీంతో మొదటి ఘాట్‌ రోడ్డుమీదుగా వాహనదారులు ఏనుగులను చూసి ఆందోళనకు గురయ్యారు.భక్తులు అందించిన సమాచారం మేరకు అటవి అధికారులు వెంటనే అక్కడకి చేరుకున్నారు. ఏనుగుల గుంపును తిరిగి అరణ్యంలోనికి పంపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.గత కొన్ని రోజులుగా ఏనుగుల మంద పాపవినాశనం రోడ్డులో సంచరిస్తున్నాయి. పార్వేట మండపం వద్ద వాహనదారులని వెంబడించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.





Untitled Document
Advertisements