ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని తార్నాక సీసీఎంబీ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం నెలకొంది . అతివేగంతో దూసుకొచ్చిన బెంజ్ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. బాధిత వ్యక్తి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడిని సోహన్ గౌడ్గా, క్షతగాత్రుడిని రితేశ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. బెంజ్ కారు పూర్తిగా దెబ్బతిన్నది. అయితే వీరు గమ్యస్థానానికి కిలోమీటర్ దూరంలో ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు