డంప్ ట్రక్కును ఢీకొన్న రైలు.. ముగ్గురు మృతి

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 11:52 AM

డంప్ ట్రక్కును ఢీకొన్న రైలు.. ముగ్గురు మృతి

వాషింగ్టన్‌లో అమెరికా మిస్సోరిలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది . మిస్సౌరీలో ఆమ్‌ట్రాక్ రైలు పట్టాలు అదుపు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి గాయపడ్డారు. ఇదే ఘటనలో దాదాపు 12 మంది సిబ్బంది గాయపడ్డట్లు తెలుస్తున్నది. ఆమ్‌ట్రాక్ మీడియా సెంటర్ ప్రకారం.. రైలు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఎనిమిది బోగీలు, రెండు ఇంజన్లు పట్టాలు తప్పాయి. మిస్సౌరీలోని మెండన్ సమీపంలోని పబ్లిక్ క్రాసింగ్ వద్ద ట్రక్కు ఆగి ఉంది. ఎలాంటి గేట్లు లేకపోవడంతో ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మెండన్ నగరానికి సమీపంలోని పబ్లిక్ క్రాసింగ్ వద్ద మధ్యాహ్నం 12.42 గంటలకు రైలు డంప్ ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి చేర్చారు .





Untitled Document
Advertisements