శ్రీనగర్, జనవరి 6: కశ్మీర్లో మంచు తుఫాను దాటికి పలువురు ప్రాణాలను కోల్పోయారు. కుప్వారా జిల్లాలో శుక్రవారం సాయంత్రం సంభవించిన మంచు తుఫానుకు కుప్వారా-తాంగ్దర్ రోడ్డులో ఓ వాహనం గల్లతైంది. ఆ వాహనంలో ఉన్న 8 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు బృందాలు, సైన్యం, విపత్తు స్పందన దళం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టాయి. అందులో ఆరుగురి మృతదేహాలు వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.